ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు ఆగిపోతాయా? లబ్ధిదారుల్లో ఆందోళన – ఎస్ఈసీ స్పష్టత
Breaking News – Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై ఎస్ఈసీ కీలక స్పష్టత – కొత్త లబ్ధిదారులకు ఆగిపోయే అవకాశం తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో, (Breaking News – Indiramma House) హైదరాబాద్ మరియు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలను మినహాయించి మిగతా అన్ని జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీనితో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల్లో బిల్లుల చెల్లింపులపై సందేహాలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలకమైన స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే పని ప్రారంభించిన లబ్ధిదారులకు బిల్లులు అందుతాయని, అయితే కొత్త నిర్మాణాలు లేదా కొత్త లబ్ధిదారులకు నిధులు ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఈ నియమాలు నవంబర్ 11 వరకు అమలులో ఉంటాయి.
ఎన్నికల నియమావళి ప్రకారం,
- మంత్రులు, అధికారులు కొత్త పథకాలు ప్రకటించకూడదు, శంకుస్థాపనలు చేయరాదు.
- విచక్షణ నిధుల నుంచి కొత్త గ్రాంట్లు లేదా చెల్లింపులు మంజూరు చేయరాదు.
- అధికార వాహనాలను, యంత్రాంగాన్ని ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించరాదు.
- ఎన్నికల నిర్వహణలో ఉన్న అధికారుల బదిలీలు లేదా పోస్టింగ్లు ఎస్ఈసీ అనుమతి లేకుండా చేయరాదు.
- లౌడ్స్పీకర్లు, ఊరేగింపులు, బహిరంగ సభలు నిషేధం.

అత్యవసర పరిస్థితుల్లో — కరువు, వరదలు, లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే — ప్రజలకు సహాయం ఎస్ఈసీ అనుమతితోనే చేయాలి.
ఈ నియమావళి స్థానిక ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అమల్లో ఉంటుంది.
Read also :