📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Breaking News – Onion : ఫ్రీ అనగానే క్షణాల్లో ఉల్లి మాయం

Author Icon By Sudheer
Updated: September 17, 2025 • 7:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు (Kurnool ) వ్యవసాయ మార్కెట్‌లో తాజాగా చోటుచేసుకున్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పంటకు సరైన మద్దతు ధర లేక రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు ఉచితమని వినగానే బండెనక బండి కట్టి ఉల్లి (Onion) బస్తాలను ఎత్తుకెళ్లడం పరిస్థితిని మరింత విషాదకరంగా మార్చింది. బైక్‌లు, ఆటోలు, సైకిళ్లు లేకపోతే నడుచుకుంటూ మరీ ప్రజలు మార్కెట్ వద్దకు చేరి అందినకాడికి ఉల్లి బస్తాలను తీసుకెళ్లారు. ఒకరు మొదలుపెట్టగానే ‘ముందుకు పదండి’ అన్నట్లుగా మరికొందరు కూడా తరలిపోయి పెద్ద ఎత్తున బస్తాలను దోచుకెళ్లడం అక్కడి పరిస్థితిని అదుపులో పెట్టలేనిదిగా మార్చింది.

గత కొద్దికాలంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లిపాయలు పెద్ద ఎత్తున చేరుతున్నాయి. అయితే రేట్లు పతనం కావడంతో వ్యాపారులు తక్కువ ధరలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం క్వింటా ఉల్లిని రూ.1200 చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని రైతు బజార్లకు తరలించి అమ్మకాలు నిర్వహిస్తోంది. అయితే మిగిలిపోయిన ఉల్లిని బహిరంగ వేలంలో విక్రయించినా ధరలు క్వింటాకు రూ.50 వరకు పడిపోయాయి. దీనివల్ల రైతులు మరింత నష్టపోగా, మార్కెట్ యార్డులో ఉల్లిపాయలు నిల్వ అయ్యిపోవడం మొదలైంది.

ఈ నిల్వ ఉల్లిని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారన్న వార్తలు బయటపడగానే కర్నూలు ప్రజలు ఆగ్రహంతో మార్కెట్‌కు చేరుకుని, ఉల్లిపాయ బస్తాలను ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. కొద్ది సేపట్లోనే ట్రక్కులు, ఆటోలు, బైకులు నిండా ఉల్లిపాయలతో తరలిపోయాయి. అధికారులు, పోలీసులు చేరుకునేసరికి ఎక్కువ భాగం బస్తాలు మాయం అయ్యాయి. మార్కెట్ అధికారులు “డంపింగ్ యార్డుకు తరలిస్తోన్న ఉల్లిని ప్రజలు అపోహతో దోచుకెళ్లారు” అని వివరణ ఇచ్చినా, రైతుల కష్టపడి పండించిన పంట ఇలా విలువలేని స్థితికి చేరుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ సంఘటన వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

https://vaartha.com/rajnath-singh-defense-minister-at-telangana-liberation-day-celebrations/telangana/549274/

Onion Onion news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.