📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు ఆలస్యం

Author Icon By sumalatha chinthakayala
Updated: January 15, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలి పెరగడంతో ఆయా ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంతాల్లో దృశ్యమానత అధ్వానస్థితికి చేరింది. పలు ఏరియాల్లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. రోడ్డుపై ముందు వెళ్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. పొగమంచు కారణంగా ఢిల్లీలో విమాన, రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

image

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 6 గంటలకు విజిబిలిటీ 100 మీటర్లుగా నమోదైంది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే దాదాపు 200కిపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని విమానాలను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. విమాన సర్వీసులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇండిగో, స్పైస్‌జెట్‌, ఎయిర్‌ ఇండియా సహా పలు విమాన సంస్థలు తమ ప్రయాణికులకు ముందుగానే పలు సూచనలు చేశారు.

పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని.. ఫ్లైట్‌ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సూచించాయి. మరోవైపు దట్టమైన పొగమంచు కారణంగా కనీసం 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. బుధవారం ఢిల్లీ-ఎన్సీఆర్‌ ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇదిలా ఉండగా.. బుధవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ చాలా పేలవమైన కేటగిరీలో నమోదైంది. 8 గంటల సమయంలో ఢిల్లీలో ఏక్యూఐ లెవల్స్‌ 332గా నమోదయ్యాయి.

Delhi- NCR Dense Fog flights delayed visibility

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.