తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం అధికారికంగా ప్రారంభమైంది. అక్టోబర్ మధ్య నుంచి వాతావరణంలో చల్లదనం పెరుగుతూ, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉత్తర జిల్లాలు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అలాగే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతాలు కర్నూలు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా కమ్మేస్తోంది. ఈ మార్పు వాతావరణం కారణంగా రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉదయం ప్రయాణాల్లో చల్లని గాలులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే అవకాశం ఉంది.
Latest News: TG Cabinet: 78 యంగ్ ఇండియా గురుకులాలు.. ఆమోదం తెలిపిన కేబినెట్
పొగమంచు కారణంగా రోడ్లపై దృశ్యమానత (visibility) బాగా తగ్గిపోవడం వాహనదారులకు ప్రధాన సమస్యగా మారింది. తెల్లవారుజామున, ఉదయం ప్రారంభ గంటల్లో దూరం కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశముంది. హైవేలు, రూరల్ రోడ్లలో ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించక డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బైక్ రైడర్లు, కార్ల డ్రైవర్లు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. పొగమంచు కారణంగా రోడ్లపై తేమ పెరగడం వల్ల టైర్లు స్లిప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

పోలీసులు మరియు ట్రాఫిక్ అధికారులు వాహనదారులకు పలు సూచనలు జారీ చేశారు. డ్రైవింగ్ సమయంలో వేగం తగ్గించి నిదానంగా వెళ్లాలని, ఫాగ్ లైట్స్ లేదా లో బీమ్ హెడ్లైట్స్ వాడాలని సూచించారు. ఓవర్టేక్ చేయకూడదని, రోడ్డుపై సేఫ్ దూరం పాటించాలని హెచ్చరించారు. బైక్ రైడర్లు హెల్మెట్తో పాటు వింటర్ జాకెట్లు ధరించడం మంచిదని సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలు అవసరానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడం, వాహనాల లైటింగ్ సిస్టమ్స్ సరిచూసుకోవడం శీతాకాలంలో భద్రతకే కాక ఆరోగ్య రక్షణకూ దోహదం చేస్తుంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/