📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లు కలకలం

Author Icon By Sudheer
Updated: December 14, 2024 • 10:50 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం ఈ ఘటనల వివరాలను మీడియాకు వెల్లడించారు. నకిలీ నోట్ల తయారీ, చలామణి వెనుక ఉన్న గ్యాంగ్‌ల గురించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మెళియాపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవి వద్ద రూ.50వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని సమాచారం మేరకు పలాస, మెళియాపుట్టి, వజ్రకొత్తూరు ప్రాంతాలకు చెందిన మరికొందరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.57.25 లక్షల నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్, సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవికుమార్ నిందితుడిగా ఉండడం చర్చనీయాంశమైంది.

ఇక జి సిగడాం మండలం పెనసాం కూడలిలో ద్విచక్ర వాహనంపై నకిలీ నోట్లు తరలిస్తున్న గనగళ్ల రవి, లావేరుకు చెందిన రాజేశ్‌లు పట్టుబడ్డారు. ఒడిశాలోని పర్లాఖెముండి, గుణుపురం ప్రాంతాల నుంచి నకిలీ నోట్లను తెచ్చి చెలామణి చేస్తున్నారు. వారు మరింత సంపాదించాలని నోట్ల తయారీకి రసాయనాలు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు రూ.15 లక్షల నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తి వంటి ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

fake currency Srikakulam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.