📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul Gandhi : రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఫైర్..!

Author Icon By sumalatha chinthakayala
Updated: April 23, 2025 • 8:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్ వర్గాలు స్పందించాయి. రాహుల్ వ్యాఖ్యలు ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని అభివర్ణించాయి. ‘ఓటరు జాబితా తయారీ, పోలింగ్, ఓట్ల లెక్కింపుతో సహా ప్రతి ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారు. ఈ విషయం దేశం మొత్తానికీ తెలుసు. రాహుల్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా ఈసీని కించపరచడానికి చేసినవేనని తెలుస్తోంది’ అని ఓ ప్రకటనలో తెలిపాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే అది కేవలం చట్టాన్ని అవమానించడమే కాదని, తన సొంత పార్టీకి చెందిన వేలాది మంది ఏజెంట్లను కూడా కించపరచడమేనని ఈసీ పేర్కొంది.

ఎన్నికల సిబ్బందిని కూడా అగౌరవపర్చాడు

రాహుల్ చట్టాన్ని అగౌరవ పర్చడంతో పాటు తన సొంత పార్టీ కార్యకర్తలను, లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిని కూడా అగౌరవపర్చాడని విమర్శించింది. ఈ తరహా ఆరోపణలు ఎన్నికల సిబ్బందిని నిరుత్సాహ పరుస్తామని తెలిపింది. ఓటర్లు తమకు ప్రతికూల తీర్పు ఇచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ రాజీపడిందని చెప్పడం పూర్తిగా అవాస్తమైన వ్యాఖ్యలని వెల్లడించాయి. కాగా, అమెరికా పర్యటనలో భాగంగా రాహుల్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికలను ప్రస్తావించారు. ‘సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల మధ్య 65 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇది అసాధ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి ఓటు వేయడానికి దాదాపు 3 నిమిషాలు పడుతుంది’ అని వ్యాఖ్యానించారు. ఈసీ రాజీపడినట్టు స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు.

Read Also: సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు

Breaking News in Telugu Election Commission Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News rahul gandhi Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.