హైదరాబాద్ : సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతకు రెట్టింపు వేగంతో ఎలక్ట్రానిక్స్ వ్యర్థాలు (E-waste) విడుదల అవుతున్నాయి. సెల్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్టాప్, రిఫ్రిజిరేటర్ ఎన్ ప్రింటర్లు ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ ఉత్పత్తి వినియోగం తర్వాత వ్యర్థాలుగా మారుతున్నాయి. తెలంగాణలో తొలిసారిగా ఈ వెస్ట్ లక్ష మెట్రిక్ టన్నుల మార్ను దాటింది. 2024 -25లో 1.19.187 మేట్రిక్ టన్నుల ఈ వేస్ట్ విడుం -లయ్యాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
Read Also: DCC Presidents Selection: రేపు ఏఐసిసి పరిశీలకుల రాక

అదే 2023-24లో 5.228 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ విడుదలైంది. అంటే ఏడాది కాలంలో రాష్ట్రంలో అదనంగా 53,961 మెట్రిక్ టన్నులు ఈ వ్యర్థాలు టన్నలు పెరిగాయి. ఈ వేస్ట్(E-waste) ప్రాసెసింగ్ దేశంలో ఈ వ్యర్థాల ప్రాసెసింగ్ సామర్థ్యం 13.97 మెట్రిక్ టన్నులు కాగా ఇందులో 8.5 శాతం ప్రాసెసింగ్ వృద్ధిలో ఉత్తరప్రదేశ్ తర్వాత తెలంగాణ రెండో స్థానం లో ఉంది. 2001-22 నుంచి ఈ వెస్ట్ ప్రాసెసింగా మూడు రెట్లు వృద్ధి చెందుతోంది. ఐటీ సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం దుడుకైన ఈ వేస్ట్ నిర్వహణ విధానాలు ప్రాసెసింగ్ వృద్ధికి ప్రధాన కారణాలు 2021-22లో 42,297 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ప్రాసెసింగ్ కాగా గత ఆర్థిక సంవత్సరానికి 19 లక్ష మెట్రిక్ టన్నులకు పెరిగింది.
అయితే రాష్ట్రంలో కేవలం 15 రీసైక్లింగ్ కేంద్రాలే(Recycling centers)ఉన్నప్పటికీ ప్రాసెసింగ్లో ఈ స్థాయిలో వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ వ్యర్థాలు ప్రజారోగ్యం, పర్యావ రణంపై ప్రభావం చూపిస్తుందని పర్యావరణ నిపుణులు ఆందోళన. వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో సీసం, పాదరసం, కాడ్మియం, క్రోమియం వంటి రసాయన పదార్థాలు ఉంటాయి. వీటిని సరిగా నిర్వీర్యం చేయ కుండా పారేస్తే, గాలి, నీరు, నేల కలుషితం అవుతాయి. ఈ కలుషితాలతో శ్వాస కోశ వ్యాధులు నాడీ సంబంధిత రుగ్మతలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణవుతాయని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు. వృద్ధులపై ఈ ప్రమాదం ఎక్కు గా ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎలక్ట్రానికి వ్యర్థాల నిర్వహణ సక్రమంగా, కనీసంగా అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: