Pakistan: పాకిస్థాన్ తప్పుడు ప్రచారాలను నమ్మకండి – మిస్త్రీ

Read Time:  1 min
vikram mesri
vikram mesri
FONT SIZE
GET APP

భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తూ పాకిస్థాన్ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ తీవ్రంగా మండిపడ్డారు. దేశ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని, ఇండియన్ ఆర్మీ బేస్లను ధ్వంసం చేశామని పాకిస్థాన్ చేస్తున్నవన్నీ అసత్యమని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఈ తప్పుడు సమాచారాన్ని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

గోల్డెన్ టెంపుల్‌పై భారత సైన్యం దాడి

పాకిస్థాన్ చేస్తున్న మరో అభియోగాన్ని కూడా మిస్త్రీ ఖండించారు. అమృత్సర్‌లో గల గోల్డెన్ టెంపుల్‌పై భారత సైన్యం దాడి చేసిందని పాకిస్థాన్ చెబుతున్నదంతా పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. ఈ విధంగా మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయడం పాక్‌కు మామూలేనని, ఈ కుట్రలను దేశ ప్రజలు గుర్తించి తీవ్రంగా ఖండించాలన్నారు.

దేశ భద్రతకు మించి మరొకటి లేదు – మిస్త్రీ

వాస్తవానికి భారత ప్రభుత్వం, సైన్యం పూర్తిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, దేశ భద్రతకు మించి మరొకటి లేదని మిస్త్రీ స్పష్టం చేశారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండి ఈ పక్కదారి ప్రచారాలపై గట్టి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి మద్దతుగా అంతర్జాతీయంగా కూడా అనేక దేశాలు నిలబడుతున్నాయని, తప్పుడు ప్రచారాలతో పాక్ నైతికంగా పూర్తిగా క్షీణించిందని తెలిపారు.

Read Also : Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.