ఎయిరిండియా (Air India) విమానాల్లో తరచూ ఎదురవుతోన్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. ఈరోజు కాసేపట్లో ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. DGCA డైరెక్టర్ జనరల్ ఫయాజ్ అహ్మద్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ సమావేశాన్ని నడిపించనుంది. విమానాల నిర్వహణలో జాప్యం, లోపాలు, భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
ఘోర విమాన ప్రమాదం తర్వాత దిగిన అప్రమత్తత
జూన్ 12న అహ్మదాబాద్-లండన్ ఎయిరిండియా ఫ్లైట్ ఘోరంగా కుప్పకూలి 270 మంది మరణించిన విషాద సంఘటన తర్వాత, ఎయిరిండియా విమానాలపై భద్రతా ప్రమాణాలు ప్రశ్నించబడ్డాయి. అంతేకాదు, ఆ ప్రమాదం తరువాత రీ-స్టార్ట్ అయిన అదే రూట్లో మరో విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానయాన నియంత్రణ సంస్థ అయిన DGCA స్పందించి ఈ భేటీకి పిలుపునిచ్చింది.
వివరణ కోరే అవకాశం, భవిష్యత్తు మార్గదర్శకాలు
ఈ సమావేశంలో, ఎయిరిండియా ఇటీవల ఎదుర్కొన్న సాంకేతిక లోపాలు, నిర్వహణ వైఫల్యాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, ప్రయాణికుల భద్రత విషయంలో సంస్థ తీసుకుంటున్న చర్యలపై కూడా వివరాలు ఇవ్వాల్సిన పరిస్థితి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు DGCA తాజా మార్గదర్శకాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఎయిరిండియా పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ఈ సమావేశం కీలకం కానుంది.
Read Also : Kamal: సుప్రీమ్ కోర్టులో కమల్ హాసన్కు ఊరట.. కర్ణాటక ప్రభుత్వానికి ఒక రోజు గడువు