📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Delhi missing cases : ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్, ఏం జరుగుతోంది?

Author Icon By Sai Kiran
Updated: February 5, 2026 • 10:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Delhi missing cases : దేశ రాజధాని ఢిల్లీలో అదృశ్యాల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు, యువతులు కనిపించకుండా పోతుండటంతో తల్లిదండ్రుల్లో తీవ్ర భయం నెలకొంది. 2026 సంవత్సరం ప్రారంభమైన కేవలం 27 రోజుల్లోనే మొత్తం 807 మంది మిస్సింగ్ కేసులు నమోదవ్వడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. అంటే రోజుకు సగటున 27 మంది అదృశ్యమవుతున్నారు.

ఇందులో పోలీసులు ఇప్పటివరకు 235 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఇంకా 572 మంది ఆచూకీ తెలియకపోవడం కలవరపెడుతోంది. కనిపెట్టిన వారి కంటే కనిపించని వారి సంఖ్య ఎక్కువగా ఉండటం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చుతోంది.

Read Also: AP: కొత్త రైల్వే లైన్‌ కి రూ. 713.33 కోట్లు మంజూరు

Delhi missing cases

చిన్నారుల పరిస్థితి మరింత ఆందోళనకరం

కేవలం 27 రోజుల్లోనే 191 మంది మైనర్లు మిస్సింగ్ అయ్యారు. వారిలో కేవలం 48 మందిని మాత్రమే పోలీసులు రికవర్ చేశారు. మిగతా పిల్లల జాడ తెలియలేదు. వీరిలో 120 మంది బాలికలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అక్రమ (Delhi missing cases) రవాణా, కిడ్నాప్, బలవంతపు పనుల కోసం ఈ ఘటనలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

12 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న కౌమారదశ పిల్లలే ఎక్కువగా లక్ష్యంగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత పదేళ్లలో (2016–2026) ఢిల్లీలో 60 వేలకుపైగా చిన్నారులు అదృశ్యమైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పోలీసులు ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చర్యలు చేపడుతుండగా, తల్లిదండ్రులు కూడా పిల్లల భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu crime statistics Delhi Delhi crime news Delhi missing cases Delhi Police Investigation Delhi safety alert Google News in Telugu human trafficking India kidnapping cases Delhi latest Delhi news latest news missing children India missing girls Delhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.