📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

ఢిల్లీ ఎన్నికలు.. తొలి గంటల్లో పోలింగ్ శాతం..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 5, 2025 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. తొమ్మిది గంటల వరకు 8.10 శాతం పోలింగ్‌ నమోదైంది. పలు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఈరోజు సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ ఉండనున్నాయి. ఇక, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి జై శంకర్‌ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఢిల్లీలో 1.56కోట్ల మంది ఓటర్లు ఉండగా.. మొత్తం 13,766 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు కేటాయించారు.. వృద్ధులు, వికలాంగుల కోసం ముందస్తు పోలింగ్‌కు అవకాశం ఇవ్వగా.. 7980 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలోనే తొలిసారిగా.. ఢిల్లీలో పోలింగ్ సెంటర్ల దగ్గర రద్దీని తెలుసుకునేందుకు వీలుగా క్యూ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (QMS) అప్లికేషన్‌ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంఘం 3వేల పోలింగ్‌ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు.

కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పింక్ కలర్ రంగుల్లో బూత్‌లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో బెలూన్ల తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూత్‌లు ‘మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం’ అంటూ స్పెషల్ థీమ్‌ను తీసుకొచ్చారు.

8.10 percent polling Delhi Elections Google news Polling percentage

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.