Harish Rao : కేసీఆర్ స్పీచ్ కోసం కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్నారు..

Read Time:  1 min
Congress leaders are waiting for KCR speech.. Harish Rao
Congress leaders are waiting for KCR speech.. Harish Rao
FONT SIZE
GET APP

Harish Rao : హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రేపు ఏమి మాట్లాడతారోనని కాంగ్రెస్ నేతలే ఎక్కువగా చర్చించుకున్నారట. ఆయన సభలో ఏం చెబుతారోననే టెన్షన్ వారిలో ఉంది. వాళ్లు ఏం చేసినా రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ స్పీచ్ కోసం కాంగ్రెస్

ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే చూస్తున్నారు

తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం కష్టపడి పని చేశామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్ వైపే చూస్తున్నారని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని.. ఆత్మహత్య తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో పాలు, నీళ్ల తేడా ప్రజలకు తెలిసిందన్నారు.

ఈ పథకాలను అమలు చేయడంలో విఫలమైంది

రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని హరీష్ రావు విమర్శించారు. రైతుబంధు పథకం, 24 గంటల కరెంట్, ఇంటింటికి మంచినీరు వంటి పథకాలు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టినవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు.​

తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రానుందని, తెలంగాణ ప్రజలు అభివృద్ధి పట్ల తమ నమ్మకాన్ని కొనసాగిస్తారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని, బీఆర్‌ఎస్ మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Read Also: త్వరలోనే కాళేశ్వరం వాస్తవాలు బయటపెడతాం : మంత్రి కోమటిరెడ్డి

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.