Congress CLP Meeting : రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్.. నాలుగు అంశాలపై చర్చ!

Read Time:  1 min
Congress CLP meeting tomorrow.. Discussion on four issues!
Congress CLP meeting tomorrow.. Discussion on four issues!
FONT SIZE
GET APP

Congress CLP Meeting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విప్ లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో నాలుగు కీలకమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు ఆ పార్టీ తెలిపింది. భూ భారతి, ఎస్సీ వర్గీకరణ, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ జరగనుంది. ఇటీవల ప్రభుత్వం వరుసగా పలు ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేసింది.

 రేపు కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్

ఈ సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం

ధరణి రద్దు చేసి భూ భారతిని ఈరోజు నుంచి అమలులోకి తీసుకురాబోతున్నది. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై సీఎం ఈ సీఎల్పీ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నట్ల తెలుస్తోంది. అలాగే ఏఐసీసీ అగ్రనేతలతో రాష్ట్రంలో భారీ బహిరంగ సమావేశాల నిర్వహించడంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి వర్గ విస్తరణపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో సీఎం ఎవైనా డైరెక్షన్స్ ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

Read Also : పార్క్‌ హయత్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.