కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ స్వయంగా పంపిణీ చేశారు. సామర్లకోటలోని కుమ్మరి వీధిలో ఉన్న బాధితుల ఇళ్లకు మంత్రి వెళ్లి, వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన Rs.20 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన Rs.2 లక్షల పరిహారం చెక్కులను ఆయన అందించారు.
Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటుందని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా కల్పించారు. ప్రభుత్వం అందించిన ఈ ఆర్థిక సాయం, బాధితుల కుటుంబాలకు కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :