కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు మరియు దానికి సంబంధించిన విచారణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులో జరిగిన భారీ కుంభకోణంపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై తమ ప్రభుత్వం సీబీఐ (CBI) విచారణ కోరుతూ లేఖ రాసి ఆరు నెలలు గడుస్తున్నా, కేంద్రం ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టును ‘కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం’ అని వర్ణించారని, మరి ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలను కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు. “బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ వంటి బంధం ఉంది” అని వ్యాఖ్యానించడం ద్వారా విచారణ సంస్థల జాప్యం వెనుక రాజకీయ లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన సంకేతాలిచ్చారు.
Maharashtra: ఎలుగుబంటి దాడిలో ఒకరు మృతి.. 8 మందికి గాయాలు
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను ఉటంకిస్తూ రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో లోపభూయిష్టమైన డిజైన్ల వల్ల ప్రస్తుతం నీరు నింపితే బ్యారేజీ పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని, ఆ నిందను తమ ప్రభుత్వంపై నెట్టాలని బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టును శాస్త్రీయంగా పునరుద్ధరించకుండా నీరు నింపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడలేమని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ తప్పిదాల వల్లే నేడు తెలంగాణ ప్రజల సొమ్ము గోదావరి పాలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ను జైల్లో వేయడం తమకు పెద్ద పని కాదని, కానీ తాను రాజ్యాంగబద్ధంగా, చట్టపరమైన నిబంధనల ప్రకారమే (Procedure) ముందుకు వెళ్తానని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. “నాకు సొంత రాజ్యాంగం లేదు, దేశ రాజ్యాంగాన్నే అనుసరిస్తాను” అని వ్యాఖ్యానించడం ద్వారా కక్ష సాధింపు రాజకీయాలకు తావులేకుండా బాధ్యులను చట్టం ముందు నిలబెడతానని ఆయన భరోసా ఇచ్చారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దోషులెవరైనా సరే తప్పించుకోలేరని, దర్యాప్తు సంస్థల ద్వారానే అంతిమ నిర్ణయం జరుగుతుందని ఆయన వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com