హైదరాబాద్: ప్రభుత్వ అధికారిక కార్యాక్రమాల్లో భాగంగా ఈరోజు సీఎం రేవంత్రెడ్డి తొలిసారి కొడంగల్ నియెజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. కొడంగల్లో ఫిజియోథెరపీ, వైద్య, నర్సింగ్, కళాశాలల పనులను కూడా ప్రారంభించనున్నారు. అనంతరం హెలికాప్టర్లో కోస్గి చేరకుని పోలీస్ స్టేషన్ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘాల స్టా్ళ్లను సందర్శించి, వారితో కాసేపు ముచ్చటించనున్నారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలోనూ పాల్గొంటారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం కొంగర కలాన్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటిస్తారు. అనంతరం ఫాక్స్కాన్ కంపెనీ పనులను పరిశీలించి.. ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు.
నేడు కొడంగల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
By
sumalatha chinthakayala
Updated: October 5, 2024 • 11:53 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.