నేడు మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటన

Read Time:  1 min
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today
CM Revanth Reddy will hand over appointment documents to DSC candidates today
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డి నేడు బిజీబిజీగా గడపనున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలంలో గల మంచిరేవులలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.

అనంతరం యంగ్ ఇండియా స్కూల్ భవనానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల సేవలను గురించి ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉండగా, నేడు దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సహాయ మంత్రి బండి సంజయ్ నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి పోలీసు అమరవీరులను స్మరించుకున్నారు. దేశ సరిహద్దుల్లోపల వారు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.