📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

CM Revanth Reddy : చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Author Icon By sumalatha chinthakayala
Updated: March 22, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడుకు చేరుకున్నారు. చెన్నైలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాలిన్ నేతృత్వంలో శనివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సైతం చెన్నై వెళ్లారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల భేటీకి స్టాలిన్ ఇచ్చిన పిలుపుతో అఖిలపక్షం సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరే వరకూ అటు ఇరు రాష్ట్రాల పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేయనున్నాయి.

ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ

కాగా, కేంద్రప్రభుత్వం త్వరలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టబోతోంది. అయితే ఈ ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2026 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, హక్కులు దెబ్బతింటాయని సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు. పునర్విభజన జరిగితే 1971 జనాభా లెక్కల ఆధారంగా జరగాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే రాజ్యాంగ సవరణలు జరగాలని అంటున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెల 22న చెన్నైకు రావాలని ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం చెన్నై వెళ్లింది.

Breaking News in Telugu Chennai CM Revanth Reddy Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.