📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

CM Revanth Reddy: నేడు మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Author Icon By sumalatha chinthakayala
Updated: March 24, 2025 • 2:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి పయనం కానున్నారని సమాచారం. పార్టీ కీలకనేత కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సాయంత్రం భేటీకానున్నారు. ఈరోజు, రేపు ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ పెద్దలతో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీరు ఢిల్లీకి వెళ్తారన్న సమాచారం రాగానే మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది.

కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్సీల రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు నియోజకవర్గాల పునర్ విభజనపై ఇటీవల చెన్నైలో జరిగిన సమావేశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో చర్చిస్తారని సమాచారం. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ద్వారా కలిగే నష్టం, రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే దానిపై చర్చించారు. చెన్నై సదస్సులో తీర్మానాలతో పాటు దక్షిణాదిన డీలిమిటేషన్ పై జరుగుతున్న గందరగోళాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు రెండో విడత నామినేటెడ్ పోస్టులపై ఢిల్లీ పెద్దలతో రేవంత్ రెడ్డి, భట్టి మంతనాలు జరుపుతారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.

Breaking News in Telugu CM Revanth Reddy delhi Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.