దేశవ్యాప్తంగా మూడురంగుల పండుగ ఘనంగా జరుగుతున్నది. వాడవాడలా త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఢిల్లీలో ఎర్రకోటవద్ దేశప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగరవేసారు. తెలంగాణలో సీఎం (CM) రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో ఈ ఉదయం జెండావందన కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి కృష్ణా, గోదావరి జిల్లాలో తెలంగాణ వాటా చుక్క నీటిని కూడా వదులుకోమని అన్నారు. తమ రాష్ట్ర అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీటి పంపిణీపై చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది, భయపడేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ (Telangana) నీటిహక్కులపై ఎవరు ఎన్నిఎత్తులు వేసినా చిత్తు చేస్తామని CM రేవంత్ రెడ్డి స్పష చేశారు.
ఖమ్మం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న భట్టి
ఖమ్మం పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా జతీయ జెండా ఆవిష్కరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా రైతులకు 20వేల 216 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు. గతపాలకుల పాపాలు శాపాల్లాగా వెంటాడుతున్నాయని ఆరోపించారు. రైతులు సంక్షేమం విషయంలో రాజీపడేది లేదని భట్టి స్పష్టం చేశారు.