ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025 (2025 Women’s Cricket World Cup) ఫైనల్లో చారిత్రక విజయం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అద్భుత ఆటతీరును ప్రదర్శించి ప్రతిష్ఠాత్మక టైటిల్ను కైవసం చేసుకున్న భారత క్రీడాకారిణులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Read Also: PM Modi: ఈ గెలుపు భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది: ప్రధాని మోదీ
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) మాట్లాడుతూ.. భారత క్రీడాకారిణులు ప్రదర్శించిన మొక్కవోని పట్టుదల, ధైర్యసాహసాలు, అంకితభావం ప్రశంసనీయమని కొనియాడారు. జట్టును ముందుండి నడిపించిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (Captain Harmanpreet Kaur) నాయకత్వ పటిమను, ఫైనల్లో జట్టు కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ విజయంతో దశాబ్దాల కల నెరవేరింది
“ఈ విజయంతో దశాబ్దాల కల నెరవేరింది. భారత మహిళా జట్టు సాధించిన ఈ అద్భుతమైన ఘనతకు యావత్ దేశం గర్విస్తోంది. మన క్రీడాకారిణులు ప్రదర్శించిన పోరాట పటిమ, క్రీడాస్ఫూర్తి దేశవ్యాప్తంగా వర్ధమాన క్రికెటర్లకు గొప్ప ఆదర్శంగా నిలుస్తుంది” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో మన జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు భారత మహిళల జట్టుకు, బీసీసీఐ (BCCI) కి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: