📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Author Icon By Sudheer
Updated: March 1, 2025 • 5:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా, ప్రతీ ఒక్కరికీ రూ.15,000 చొప్పున మే నెలలో అందజేస్తామని వెల్లడించారు. దీని ద్వారా విద్యార్థుల చదువుకు ఏ విధంగా అవరోధాలు లేకుండా చూడగలుగుతామన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నిర్ణయం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందనున్నారు.

రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఇక రైతుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతులకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా, సాగు కొనసాగించేందుకు కావాల్సిన ప్రోత్సాహకాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల సాయం

ఇదే విధంగా మత్స్యకార కుటుంబాలను కూడా ప్రభుత్వం విస్మరించబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాలకు కూడా రూ.20,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఇక ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. జూన్ నాటికి DSC ప్రక్రియ పూర్తవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. వారికి మంచి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సీఎం తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పాలన కొనసాగిస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తామని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు.

Breaking News in Telugu Chandrababu Google news Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.