ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CBN) ఐదు రోజుల సింగపూర్ పర్యటనను ప్రారంభించారు. బృందంతో కలిసి ఆయన సింగపూర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న స్థానిక తెలుగు ప్రజలు సంప్రదాయ నృత్యాలతో సీఎం బృందాన్ని ఆహ్వానించారు. ఈ పర్యటనలో పెట్టుబడుల ఆహ్వానం, పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.
29 సమావేశాలు – ముఖ్యమైన ప్రణాళికలు
సింగపూర్ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు మొత్తం 29 సమావేశాల్లో పాల్గొననున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో ప్రభుత్వ స్థాయి సమావేశాలతో పాటు, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో, టెక్ కంపెనీల ప్రతినిధులతో, స్మార్ట్ సిటీ అభివృద్ధికి సంబంధించిన సంస్థలతో చర్చలు జరుగనున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడం, కొత్త అవకాశాలను అన్వేషించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొనవచ్చు.
తెలుగు డయాస్పోరాతో సమావేశం
ఈ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు తెలుగు డయాస్పోరా సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులు, ఎన్ఆర్ఎళ్లతో రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని పరిగణించనున్నారు. ప్రత్యేకంగా ఐటీ, విద్య, ఆరోగ్య రంగాల్లో ఎన్ఆర్ఎల సహకారం కోరనున్నారు. సీఎం బృందానికి స్వాగతం పలికిన వారిలో పలువురు పారిశ్రామికవేత్తలు, తెలుగువారి సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Read Also : AP : సముద్రంలో అలజడి.. వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు- APSDMA