📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

ఏపీలో ఇంటర్ విద్యార్థులకు సా.5 వరకు తరగతులు

Author Icon By Sudheer
Updated: October 16, 2024 • 5:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ ఇంటర్ కాలేజీల్లో నేటి నుంచి ఒక గంట అదనంగా క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్మీడియట్ కాలేజీలు ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తున్నారు. ఈ టైమింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌వ‌రించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఉద‌యం 9 గంట‌ల నుండి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు టైమింగ్స్‌ను పొడిగించారు. ఈ క్రమంలో విద్యార్థులను పరీక్షలకు ప్రిపేర్ చేసేందుకు అదనపు సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.

విద్యార్థులు సరిగా రాణించ‌క‌పోవ‌డంతోనే గంటసేపు టైమింగ్స్ పెంచామ‌ని.. ఆ గంట‌సేపు విద్యార్థులు కాలేజీల్లోనే చ‌దువుకుంటార‌ని తెలిపారు. ఇక నుంచి సాయంత్రం 4 గంట‌ల నుండి 5 గంట‌ల వ‌ర‌కు కాలేజీల్లో స్ట‌డీ అవ‌ర్స్ నిర్వ‌హించాల‌ని డైరెక్ట్ కృతిక శుక్లా ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేర‌కు టైమ్ టేబుల్స్‌ను సిద్ధం చేయాల‌ని అన్ని ప్ర‌భుత్వ, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియట్ కాలేజీ ప్రిన్సిప‌ల్స్‌కు ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ జూనియ‌ర్ కాలేజీల్లో చ‌దువుతున్న విద్యార్థుల‌కు ప్రైవేట్ స్కూళ్లలో ఇచ్చిన‌ట్లే ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాల‌ని కృతిక శుక్లా ఆదేశించారు. ఆ కార్డు న‌మూనాను కాలేజీలకు పంపించారు. వృత్తి విద్యా కోర్సుల విద్యార్థుల‌కు తెల్లరంగు, జ‌న‌ర‌ల్ విద్యార్థుల‌కు ఫస్టియర్‌ విద్యార్థులకు వారికి లేత ప‌సుపు రంగు, సెకండియర్‌ విద్యార్థులకు నీలం రంగు కార్డుల‌ను ముద్రించి ఇవ్వాల‌ని సూచించారు.

Ap inter inter class timings

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.