📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu’s Rule : చంద్రబాబు పాలన అద్భుతం

Author Icon By Sudheer
Updated: May 14, 2025 • 8:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి (CM Chandrababu) పరిపాలన అద్భుతమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ్ (Venkate Gowda Gopala Gowda) ప్రశంసించారు. చంద్రబాబు దార్శనికత కలిగిన నాయకుడని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం రాబోయే రోజుల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన అన్నమయ్య జిల్లా చీకలబైలులో జరుగుతున్న గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయి

ఈ సందర్భంగా అమరావతి రాజధాని గురించి జస్టిస్ గోపాలగౌడ్ ప్రస్తావించారు. రాజధానిగా అమరావతికి తాను గతంలోనే మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, అమరావతి రైతులు చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయడం అభినందనీయమని అన్నారు. రైతులకు న్యాయం జరుగుతుండటం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.

వైసీపీ పై విమర్శలు

తదుపరి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కూడా ఆయన స్పందించారు. అక్రమాలకు పాల్పడ్డ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై సమగ్ర విచారణ జరిపి, తప్పు నిరూపితమైతే కఠిన శిక్షలు విధించాలన్నారు. అధికారం చేతిలో ఉందని అన్యాయాలు చేసే వారికి చట్టపరంగా తగిన శిక్షలు పడినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందన్నారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో అధికారుల నిర్వాహనంలో నైతిక బాధ్యతను పెంచుతాయని జస్టిస్ గోపాలగౌడ్ స్పష్టం చేశారు.

Read Also : TPCC : వారం రోజుల్లో టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు?

Chandrababu chandrababu rule Chandrababu's rule is amazing Google News in Telugu Venkate Gowda Gopala Gowda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.