📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలి : భూమన

Author Icon By sumalatha chinthakayala
Updated: January 9, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. పశువుల మంద మాదిరిగా భక్తులను తోసేశారు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. టీటీడీ వ్యవస్త పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఇవాళ చంద్రబాబు పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ తొక్కిసలాట జరిగిన సమయంలో ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

image

సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారన్న పవన్ దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దేవుడిని రాజకీయాల కోసం పావులా వాడుకుంటున్నారని తెలిపారు. చనిపోయిన వారికి రూ.20లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడిన 10లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. లడ్డూ విషయంలో వైసీపీ, జగన్ పై అసత్య ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు.. చేసే చేతలకు పొంతన లేదన్నారు.ఈవో, జేఈవోలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధువారం జరిగిన తొక్కిసలాట ఘటనా అందర్నీ దిగ్బ్రాంతికి గురిచేసింది. స్వామి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చిన కారణంగా గందరగోళం చోటుచేసుకొని తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు.

Bhumana Karunakar Reddy CM chandrababu Stampede in Tirupathi YSRCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.