📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

Latest news: Chandrababu Naidu: డేటా ఆధారిత పాలనపై బాబు అధ్యక్షతన సదస్సు

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
డేటా ఆధారిత పాలనతో సుపరిపాలన లక్ష్యం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారి అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలన పై ఒక కీలక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, మరియు హెచ్ఓడీలు ప్రత్యక్షంగా హాజరు కాగా, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సుపరిపాలన అందించడమేనని పునరుద్ఘాటించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా విజన్ ప్రణాళికలు రూపొందించుకుని, పౌరులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు.

ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రాధాన్యత ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపైనే ఉండాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్‌గా మార్చుకుని, ఆ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల వచ్చిన తుఫాన్‌ను ఎదుర్కోవడంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ఆయన ప్రశంసించారు. రాష్ట్రస్థాయి నుండి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి నష్ట నివారణ చేయగలిగామని తెలిపారు.

Read also: చర్చలు ఫలించకపోతే ఇక యుద్ధమే..ఆసిఫ్

Chandrababu Naidu: డేటా ఆధారిత పాలనపై బాబు అధ్యక్షతన సదస్సు

ప్రజాసేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు సూచన

డేటా ఆధారిత పాలన ఆధునిక పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే జనవరి నెలలో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వనరులను సమర్థంగా వినియోగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ఒక్కో సమస్యను క్రమంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల ప్రకారం నెలవారీ, త్రైమాసిక ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగించి, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

ap-government ap-secretariat chandrababu-naidu data-driven-governance Latest News in Telugu Telugu News vision-2047

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.