వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంధించిన విమర్శలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బొత్స కీలక ప్రశ్నలు లేవనెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబుతో మాట్లాడి ఆపించానని రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పారని, అయితే ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మౌనం వహించడమంటే రేవంత్ చెప్పిన మాటలు వాస్తవమని ఒప్పుకున్నట్టేనా అని ఆయన నిలదీశారు. రాయలసీమ ప్రయోజనాలను పక్కన పెట్టి, తెలంగాణ సీఎంతో కుమ్మక్కై ప్రాజెక్టును అడ్డుకోవడం ఆ ప్రాంత ప్రజలకు చేసిన ద్రోహమని ఆయన మండిపడ్డారు.
Velugumatla House Collapse : కాంగ్రెస్ కూలగొట్టిన చోటే..ఇళ్లు కట్టిస్తాం – కేటీఆర్
మరోవైపు, తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో జరుగుతున్న వివాదంపై కూడా బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం, ధనార్జన కోసం పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై అపనిందలు వేశారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై అసెంబ్లీలో లేదా బహిరంగ వేదికలపై చర్చ జరగాలని తాము కోరుతుంటే, అధికార కూటమి ప్రభుత్వం కావాలనే అడ్డుపడుతోందని విమర్శించారు. ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షం గొంతు నొక్కుతోందని, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు వైసిపి సోషల్ మీడియా వేదికగా బొత్స మాట్లాడిన వీడియోను విడుదల చేస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :