Breaking News – Jublihils Bypoll : నేటితో ముగియనున్న బై పోల్ ప్రచారం

Read Time:  1 min
Jublie Hills elections
Jublie Hills elections
FONT SIZE
GET APP

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం జరుగుతున్న ప్రచార యుద్ధం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటల తరువాత ప్రచార రథాలు, మైకులు మూగబోతున్నాయి. ఎన్నికల నియమావళి ప్రకారం, పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు చివరి గంటల వరకూ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ, చివరి నిమిషం వరకు ఓటర్ల మనసులను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు గుప్పిస్తూ, వాగ్వాదం మరింత ఉధృతమైంది.

ఇక ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా మారిన నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీ.వి. ఆనంద్ (సజ్జనార్) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్‌ షాపులు, బార్లు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ సమయంలో మద్యం నిల్వ లేదా సరఫరా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో మద్యం ప్రభావం ఉండకుండా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయాలన్నదే ఈ నిర్ణయానికి ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.

ఇక ఓటింగ్‌ రోజు నవంబర్ 11న జూబ్లీహిల్స్‌లో భద్రతా ఏర్పాట్లు భారీ స్థాయిలో చేయనున్నారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి, సున్నితమైన పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరా పర్యవేక్షణను ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్‌ రోజున శాంతి భద్రతలు కాపాడటమే కాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రజల్లో కూడా ఈ ఎన్నికల పట్ల ఆసక్తి పెరిగింది. ప్రచార వేడి ముగిసిన తర్వాత, ఇప్పుడు అందరి చూపు నవంబర్ 11న జరిగే ఓటింగ్‌పై కేంద్రీకృతమైంది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.