📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Tahawwur Rana : తహవ్వుర్‌ రాణా కోసం బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 10, 2025 • 1:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Tahawwur Rana: కొంతసేపట్లో భారత్‌కు 26/11 ముంబయి దాడుల కీలక సూత్రధారి తహవ్వుర్‌ రాణా రానున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అతడిని తరలించేందుకు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారు. రాణాను తీసుకువస్తోన్న విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే.. అతడిని అక్కడినుంచి జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. అప్పుడు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వినియోగించనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతోపాటు కొన్ని సాయుధ వాహనాలు వెంట ఉంటాయి. అలాగే ఢిల్లీకి చెందిన స్పెషల్ సెల్‌ను అలర్ట్‌లో ఉంచారు. SWAT కమాండోలను విమానాశ్రయం వద్ద మోహరించారు.

ఈ సాయుధ వాహనం ఎలాంటి దాడినైనా తట్టుకొని నిలబడగలదు

ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మార్క్స్‌మ్యాన్‌ వాహనాన్ని సిద్ధంగా ఉంచారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సాయుధ వాహనం.. ఎలాంటి దాడినైనా తట్టుకొని నిలబడగలదు. దాడుల ముప్పు పొంచి ఉన్న వ్యక్తులను తరలించేందుకు భద్రతా సంస్థలు వీటిని ఉపయోగిస్తుంటాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడన్న ఆరోపణలపై 2009లో అమెరికాలో అరెస్టయిన రాణాను అప్పగింత ప్రక్రియలో భాగంగా దాదాపు 16 ఏళ్లకు భారత్‌కు తీసుకువస్తున్నారు. ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోన్న ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నరేందర్‌ మాన్‌ నియమితులయ్యారు. ముంబయి దాడి వెనక పాకిస్థాన్‌ నాయకుల పాత్రను నిర్ధరించే దిశగా విచారణ ఉండనుందని తెలుస్తోంది. దాంతో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Read Also: మే చివరి నుంచే వర్షాలు పడే అవకాశం – స్కెమెట్

Breaking News in Telugu Bulletproof vehicle commandos Google news Google News in Telugu india Latest News in Telugu Paper Telugu News Tahawwur Rana Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.