📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nani , Vamshi : వారిద్దరూ కర్మ అనుభవిస్తున్నారు – కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు

Author Icon By Sudheer
Updated: May 20, 2025 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం స్కామ్ కేసులో జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుందన్న భావన అసత్యమని స్పష్టం చేశారు. “జగన్ అరెస్టు అయినా, బెయిల్ రద్దయినా ప్రజలు మద్దతు ఇస్తారన్నది అపోహే. అరవింద్ కేజ్రీవాల్‌ వంటి నేత జైలు వెళ్లి వచ్చాక పార్టీ పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలుసు” అని ఆయన గుర్తుచేశారు.

మాజీ ఎమ్మెల్యేలు తీవ్ర వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని (Kodalinani , Vamshi) చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు వారు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారని కోటంరెడ్డి పేర్కొన్నారు. “వంశీ ఆరోగ్యం దెబ్బతిని నరకం అనుభవిస్తున్నారు. నాని గుండె నొప్పితో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అసభ్యంగా మాట్లాడిన వారిపై ప్రజలకు సానుభూతి ఉండదు. ఇది దేవుడి స్క్రిప్ట్” అని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో తమ పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారాల వల్ల వైసీపీకే నష్టం జరిగిందని, టీడీపీకే లాభం జరిగిందని తెలిపారు.

జగన్, సజ్జల వ్యవహారశైలి మీద ఆరోపణలు

జగన్ ప్రోత్సాహంతోనే పలువురు నేతలు అసభ్యంగా మాట్లాడారని, పార్టీ ఆఫీసు నుంచి స్క్రిప్ట్ వచ్చేదని కోటంరెడ్డి ఆరోపించారు. “హుందాగా మాట్లాడితే భవిష్యత్తు ఉండదని, దూషించాలి, దాడి చేయాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పేవారు” అని వెల్లడించారు.

Read Also : Notice : కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు

Google News in Telugu kodali nani MLA Kotamreddy Sridhar Reddy vamshi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.