📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

పాక్‌ సరిహద్దు వద్ద బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్ల మృతి !

Author Icon By sumalatha chinthakayala
Updated: February 11, 2025 • 8:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రవాదుల కోసం గాలింపు..

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లో ఐఈడీ పేలుడు సంభవించింది. అక్నూర్ సెక్టార్‌లో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు భారత సైన్యం తెలిపింది. ఆ సమయంలో భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్.. ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అక్నూర్ సెక్టార్‌లోని లాలియాలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్-ఐఈడీ పేలినట్లు సైన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఈ ఘటన జరిగిన వెంటనే అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ.. ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం గస్తీ కాస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలిపింది. ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సైనికులకు వైట్ నైట్ కార్ప్స్ ట్విటర్ వేదికగా సెల్యూట్ చెప్పింది. వారి త్యాగాలు గుర్తుండిపోతాయని పేర్కొంది.

ఈ ఘటనను భద్రతా బలగాలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అక్కడ దర్యాప్తు ప్రారంభించారు. పేలుడుకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇక ఇవాళ అక్నూర్ సెక్టార్‌లో మోర్టార్ షెల్‌ను భద్రతా బలగాలు విజయవంతంగా నిర్వీర్యం చేశాయి. నమందార్ గ్రామంలోని ప్రతాప్ కెనాల్ వద్ద ఈ మోర్టార్ షెల్‌ను చూసిన స్థానికులు సైన్యానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సైన్యం.. ఆ మోర్టార్ షెల్ పేలకముందే దాన్ని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.

bomb blast Google news Pakistan border Two soldiers killed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.