కొండా సురేఖకు భారీ షాక్.. కోర్టు నోటీసులు

Read Time:  1 min
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow
Defamation suit against Konda Surekha. Nagarjuna to appear in court tomorrow
FONT SIZE
GET APP

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు కోర్టు షాకిచ్చింది. నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. కాగా.. నాగచైతన్య , సమంతల గురించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నాగార్జున దాఖలు చేసిన పిటిషన్‌పై 8వ తేదీన స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు (గురువారం) విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరుతూ ధర్మాసనం ఆమెకు నోటీసులు జారీ చేయడం జరిగింది.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.