📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ ప్రజలపై విద్యుత్ భారం లేదు.. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు షాక్

జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం : బీజేపీ ఎమ్మెల్యే

Author Icon By sumalatha chinthakayala
Updated: April 10, 2025 • 8:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి : బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి జగనన్న కాలనీల భూసేకరణలో భూకుంభకోణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం జరిగింది. రాష్ట్రంలో రూ.2,500 కోట్ల కుంభకోణం జరిగింది. ధర తక్కువగా ఉన్న భూమవులను గుర్తించి తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు ఇచ్చారు. ఆదోని మండలం మండగిరి లో 65 మంది రైతుల నుంచి సేకరించారు. ఎకరా రూ.5లక్షలకు రైతులతో ఒప్పందం చేసుకున్నారు. ప్రభుత్వం రూ.13 లక్షల నుంచి రూ.23 లక్షలు నేతలు తీసుకున్నారు.

బ్యాంకు అకౌంట్ లు ఓపెన్ చేసి పాసుపుస్తకాలు నేతల దగ్గర పెట్టుకున్నారు. ఆదోని నియోజకవర్గంలోనే 23 కోట్లు ప్రభుత్వం ఇస్తే రైతులకు చేరింది 13 కోట్లు మాత్రమే. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, వారి అనుచరులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రమంతా అన్ని నియోజకవర్గాల్లో ఇలాగే రైతులను మోసాగించి నేతలు నొక్కేశారు. 175 నియోజకర్గాల్లో 2,500 కోట్ల కుంభకోణం జరిగింది. పేద రైతులకు దక్కాల్సిన డబ్బులు వైసీపీ నేతలు తినేశారు. వేలాది మంది రైతులను మోసం చేశారు. జగనన్న కాలనీ భూములకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి రూపాయి రైతుకు చేరాలి. కర్నూలు జిల్లాలో జరిగిన అక్రమాలపై కలెక్టర్ విచారణ జరిపించాలి అని బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Ap Big scam BJP MLA Dr. Parthasarathi Google news Jagananna colonie Land Acquisition

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.