ఎన్నికల షెడ్యూల్
గత ఏడాది(AP) అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని(YCP) కూల్చి అధికారంలోకి వచ్చిన కూటమి ఇప్పుడు స్ధానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంఘం పదవీకాలం ఈ నెల 29న ముగుస్తుంది. ప్రస్తుతం వైసీపీ మద్దతు ఉన్న కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్యానెల్ సస్పెండ్ అయినప్పటికీ కార్యవర్గం కొనసాగుతోంది.
తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం:
- డిసెంబరు 11: జనరల్ బాడీ సమావేశం
- డిసెంబరు 12: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- డిసెంబరు 15-16: నామినేషన్లు స్వీకరణ
- డిసెంబరు 17: నామినేషన్ల స్క్రూటినీ, సాయంత్రం 5 వరకు ఉపసంహరణ గడువు
- డిసెంబరు 23: ఎన్నికలు, కౌంటింగ్, విజేతల ప్రకటణ
Read also: సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్బస్టర్స్

పార్టీల ప్రభావం, ఆసక్తి
ఈ ఎన్నికలలో(AP) సచివాలయ ఉద్యోగులు ఓటర్లు కాగా, గతంలో జరిగిన ఎన్నికలు చూపిన విధంగా, ఉద్యోగులపై రాజకీయ పార్టీల ప్రభావం ఉండటం గమనార్హం. కూటమి, వైసీపీ రెండూ ఈ ఎన్నికలను ప్రాతినిధ్యం సాధించడానికి ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. ఉద్యోగులు తమకు నచ్చిన అభ్యర్ధులను ఎన్నుకునే అవకాశంలో ఉన్నారని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: