📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

జగన్‌కు పాస్‌పోర్టు పునరుద్దరణకు హైకోర్టు ఆదేశాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 8, 2025 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఐదేళ్ల కాలపరిమితతో పాస్‌పోర్టు జారీ చేయాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. గతంలో ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టేసింది. గత ఏడాది ఆగస్టులో జగన్మోహన్‌రెడ్డి తన కుమార్తెల పుట్టిన రోజు కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేశారు. తనకు రెగ్యులర్ పాస్‌పోర్టు ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. అంతకు ముందు ఐదేళ్ల కాలానికి పాస్‌పోర్టు ఇవ్వాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులపై ప్రజాప్రతినిధుల కోర్టు స్టే విధించింది. ఏడాది పునరుద్ధరణకే అంగీకరించింది. దీని కూడా కొన్ని షరతులు పెట్టింది. 20 వేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని సూచించింది.

image

ఈ ఉత్తర్వులపైనే హైకోర్టు ఆశ్రయించిన జగన్‌కు కాస్త ఊరట లభించింది. ఐదేళ్ల పాటు పాస్‌పోర్టు జారీకి వీలుగా నిరంభ్యంతర పత్రం ఇవ్వాలని ఆదేశించింది. 2019 నుంచి ఐదేళ్లపాటు జగన్ మోహన్ రెడ్డికి డిప్లొమేటిక్‌ పాస్‌పోర్ట్‌ ఉండేది. 2024లో పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆ పాస్‌పోర్టు రద్దు అయిపోయింది. దీంతో ఆయన తన వ్యక్తిగత పాస్‌పోర్టు మీదనే విదేశాలకు వెళ్లాలి. సెప్టెంబర్‌లో విదేశాలకు వెళ్లాల్సిన ఆయన తన పాస్‌పోర్టు రెన్యువల్ చేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని చెప్పిన సీబీఐ కోర్టు ఆదేశాలను చూపించారు. అయితే 2018లో నమోదు అయిన పరువునష్టం దావా కేసు విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. ఆ కేసులో కూడా ఎన్‌వోసీ తీసుకురావాలని సూచించారు.

2018లో విజయవాడ కోర్టులో జగన్ మోహన్ రెడ్డిపై అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ పరువు నష్టం దావా వేశారు. పాస్‌పోర్టు జారీకి ఈ కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు సంగతి తనకు తెలియదన్న జగన్ కోర్టుకు వెళ్లారు. విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇది అబద్దమని పీపీ వాదించారు. ఆ కేసులో ఇచ్చిన సమన్లు అందుకోవడం లేదని, 2019, 2024లో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో కూడా కేసు గురించి ప్రస్తావించారని తెలిపారు. ఈ కేసుపై హైకోర్టు స్టే ఇవ్వలేదని కూడా కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలతో ఏకీ భవించిన విజయవాడ కోర్టు జగన్ పిటిషన్ కొట్టేసింది. కేవలం ఒక ఏడాది మాత్రమే రెన్యువల్ చేసుకోవడానికి అంగీకరించింది. అంతేకాకుండా 20వేల పూచీకత్తు స్వయంగా హాజరై ఇవ్వాలని కూడా ఆదేశించింది.

Ap AP High Court passport restore YS Jagan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.