📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

నేడు ఏపీ కేబినెట్ భేటీ..ఈ అంశాలపైనే చర్చ !

Author Icon By sumalatha chinthakayala
Updated: February 6, 2025 • 7:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగనుంది. SIPB ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనున్నది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై కూడా చర్చించనుంది. కాగా.. ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. పెట్టుబడుల ప్రోత్సాహక మండ‌లి స‌మావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా కొన్ని కీలకమైన అంశాలపైనా నిర్ణయం తీసుకోనుంది.

జనవరి 30న రాష్ట్ర పెట్టుబ‌డుల పోత్సాహాక మండలి భేటీలో 15 ప్రాజెక్ట్‌లకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా రూ.44,776 కోట్ల పెట్టుబ‌డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్‌ల‌కు మంత్రివ‌ర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరి జిల్లాలో రూ.14,328 కోట్లతో 2300 మెగావాట్ల ప్రాజెక్ట్‌ను నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో రూ.10,300 కోట్లతో మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయ‌నున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌కూ కేబినెట్‌ గ్రీన్​సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్ట్‌లను ఆమోదించే అవ‌కాశం ఉంది.

ఇక అటు ఏపీలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పటినుంచి జగన్ 2.0 ని చూస్తారని నిన్న వైఎస్ జగన్ కామెంట్స్‌ చేసిన సంగతి తెలసిందే. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తానని వివరించారు. అయితే.. జగన్ చేసిన కామెంట్స్‌ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించారు.ఎంతో మంది దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లను చంపాడని ఆరోపణలు చేశారు.

Ap AP Cabinet Meeting CM chandrababu Google news TDP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.