📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

నేడు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌

Author Icon By sumalatha chinthakayala
Updated: December 19, 2024 • 10:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ఈరోజు ఏపీ కేబినేట్‌ మీటింగ్‌ జరుగనుంది. ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అమ‌రావ‌తిలో 20 వేల కోట్ల విలువైన ప‌నులకు పాల‌న‌ప‌ర‌మైన అనుమ‌తుల‌పై ఏపీ కేబినేట్‌ లో చర్చ‌ జరుగనుంది. ఇప్ప‌టికే సిఆర్డియో అధారిటీ అమోదించిన ప‌లు ప్రాజెక్ట్ ల అమోదం కోసం ఏపీ కేబినేట్‌ ముందుకు ప్ర‌తిపాద‌న‌లు వచ్చాయి. మంగ‌ళ‌గిరిలో ఉన్న ఎయిమ్స్ సంస్ధ‌కు మ‌రో ప‌ది ఎక‌రాలు భూ కేటాయింపు ప్రతిపాదనకు కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. వీటితో పాటు రెవెన్యూశాఖకు సంబంధించిన వివిధ ప్రతిపాదనలు కూడా గురువారం కేబినెట్ ముందుకు రానున్నాయి.

పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కేబినేట్‌లో చర్చించనుంది. అటు ఏపీలో పెట్టుబడుల అంశంపై ఏపీ కేబినేట్‌ లో చర్చ జరుగనుంది. అలాగే పెన్షన్ల కోతపై కూడా చర్చ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజ‌య‌వాడ బుడ‌మేరు ముంపు బాధితుల‌కు రుణాల రీ షేడ్యుల్ కోసం స్టాంపు డ్యూటీ మిన‌హాయింపు ఇచ్చారు. ప‌లు ప‌రిశ్ర‌మ‌ల‌కు భూ కేటాయింపులు చేయనున్నారు. రెవెన్యూ శాఖ నుంచి ఈ ప్ర‌తిపాద‌న మంత్రివ‌ర్గ స‌మావేశం ముందుకు రానుంది. అలాగే రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో ప‌రిశ్ర‌మ‌ల‌కు భూ కేటాయింపుల‌కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలియచేసే అవకాశం ఉంది.

55 మీటర్లు ఎత్తులో నిర్మించే హైకోర్టు భ‌వ‌న నిర్మాణానికి రూ.1048 కోట్లు ఖర్చు కానుంది. వీటితో పాటు జీఎడీ టవర్, హెచ్ఓడీల టవర్లు మొత్తం ఐదింటిని నిర్మాణం చేయ‌నున్నారు. అన్ని టవర్లు కలిసి 68 లక్షల 88 వేల 64 చదరపు విస్తీర్ణంలో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఐదు టవర్ లకు గాను మొత్తంగా రూ. 4,608 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అన్ని టెండర్ లను డిసెంబర్ నెలాఖరుకు ముగించి పనులు చేపట్టేలా కేబినెట్ లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. 2025 జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్ధాయిలో ప్రారంభం చేయాల‌న్న సీఆర్డిఏ ప్ర‌తిపాద‌న‌లకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలపనుంది.

Ap Cabinet meeting CM chandrababu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.