ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ (Naa Anveshana) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. అన్వేష్కు చెందిన సోషల్ మీడియా ఖాతాలను శాశ్వతంగా నిలిపివేయాలని (Block) పంజాగుట్ట పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న రెండు యూట్యూబ్ ఛానళ్లు మరియు రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేయాల్సిందిగా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు లేఖలు రాయాలని పోలీస్ శాఖ డిసైడ్ అయ్యింది. రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం మరియు పంజాగుట్ట ఏసీపీ కార్యాలయం నుండి ఈ అధికారిక లేఖలు వెళ్లనున్నాయి. సమాజంలో అశాంతిని కలిగించేలా లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించేలా కంటెంట్ ఉందనే ఆరోపణల నేపథ్యంలో, ఆయన డిజిటల్ ఉనికిని నియంత్రించడమే లక్ష్యంగా పోలీసులు ఈ అడుగు వేస్తున్నారు.
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్
మరోవైపు, విదేశాల్లో ఉంటూ భారతీయ చట్టాలను సవాల్ చేస్తున్న అన్వేష్పై ఇప్పటికే పోలీసులు ‘లుకౌట్ నోటీసులు’ జారీ చేశారు. దీనివల్ల ఆయన ఏ విమానాశ్రయంలో అడుగుపెట్టినా వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పరిణామాలపై అన్వేష్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, “నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ ఇటీవల ఒక వీడియోను విడుదల చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. నిందితుడు విదేశాల్లో ఉండి విచారణకు సహకరించకుండా, దర్యాప్తు సంస్థలను కించపరిచేలా వ్యవహరిస్తుండటంతో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. సోషల్ మీడియా ఖాతాల రద్దు ద్వారా ఆయనకు వచ్చే ఆదాయ వనరులను దెబ్బతీయడంతో పాటు, ఆయన వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లకుండా కట్టడి చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశం.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com