తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఆమ్రపాలి

Read Time:  1 min
Amrapali approached Telangana High Court
Amrapali approached Telangana High Court
FONT SIZE
GET APP

హైరదాబాద్‌: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును ఆమె ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆమెతో పాటు రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ లు కోర్టులో పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ ఈ పిటిషన్ పై విచారించనుంది.

తమకు కేటాయించిన రాష్ట్రాల్లో అక్టోబర్ 16న రిపోర్ట్ చేయాలని ఈ నెల 9న డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను క్యాట్ లో సవాల్ చేశారు ఐఎఎస్ అధికారులు. అయితే డీఓపీటీ ఆదేశాలను పాటించాలని క్యాట్ అక్టోబర్ 15న ఆదేశించింది. ఈ ఆదేశాలను ఐఎఎస్ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.