📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది: రాష్ట్రపతి

Author Icon By sumalatha chinthakayala
Updated: January 31, 2025 • 12:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తున్నారు. తొలుత ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ సేవలను కొనియాడారు. అలాగే, మహాకుంభమేళా తొక్కిసలాటలో మృతిచెందిన భక్తులకు నివాళులర్పించారు. మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని అన్నారు. విద్యా రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు.

డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఇండియాలో ఏఐ మిషన్ ప్రారంభమైంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రారంభించాం. డిజిటల్ ఇండియాగా దేశాన్ని తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతోంది. యూపీఐ లావాదేవీల విధానం చూసి అభివృద్ధి చెందిన దేశాలే ముక్కున వేలేసుకుంటున్నాయి. సామాజిక న్యాయం, సమానత్వానికి మా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని ఓ సాధనంగా వినియోగిస్తోంది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా కృషి చేస్తోందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని తెలిపారు.

వక్ఫ్ బోర్డ్ సంస్కరణపై దృష్టి సారించిందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది పేదల సొంతింటి కల నెరవేరబోతోందని అన్నారు. 3 కోట్ల మంది పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. బడ్జెట్‌లో రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఇటీవలే ఇస్రో 100 వ ప్రయోగం విజయవంతంగా నిర్వహించింది.. అమృత్ భారత్, నమో భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.. ప్రభుత్వ ఉద్యోగులు కూడా మధ్య తరగతివారే కాబట్టి వారి కోసం 8వ వేతన సంఘాన్ని నియమించినట్టు తెలిపారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించబోతోంది.. ఖేలో ఇండియా దేశంలో యువతకు ఎంతో ఉపయోగపడుతోంది.. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు..వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి. అని రాష్ట్రపతి తెలిపారు.

AI mission Budget Session india Lok Sabha Parliament President Draupadi Murmu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.