📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఏపీలో నేటి నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ

Author Icon By sumalatha chinthakayala
Updated: December 2, 2024 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతీ: ఏపీ ఈరోజు నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ జరుగనుంది. సంక్రాంతి పండుగ తర్వాత.. కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కూడా జరుగనుంది. ముఖ్యంగా జగన్‌ ఫోటోలతో ఉన్న రేషన్‌ కార్డుల స్థానంలో కూడా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కూడా జరుగనుందని సమాచారం. అలాగే.. రేషన్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది చంద్రబాబు కూటమి సర్కార్‌. ఇది ఇలా ఉండగా..డిసెంబర్ 4న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం 3కి మార్పు జరిగింది. దీంతో ఈనెల 3న అంటే రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. ఇలాంటి తరుణం లోనే.. ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.

కాగా, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్​కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. అదే విధంగా రేషన్​కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పించింది. దీని కోసం ఈ రోజు నుంచి అర్హత ఉన్న వారు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత అర్హత ఉన్న వారికి సంక్రాంతికి నూతన కార్డులు మంజూరు కానున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రతిపాదిక కావటంతో పథకాల లబ్దిదారులు కొత్త రేషన్ కార్డుల కోసం ముందుకొస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాలు అందాలంటే గా బియ్యం కార్డు కలిగి ఉండాలి.

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి చేసారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డుల ప్రక్రియ పూర్తి చేయలేదు. కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం దక్కలేదు. దీంతో, మార్పులు.. కొత్తగా పెళ్లైన వారికి కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇవ్వటంతో బియ్యం కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సచివాలయాలతో పాటుగా ఏపీ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా డిసెంబర్ 28వ తేదీ వరకూ రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం కల్పించారు.

Ap AP Government Application New ration cards ration card

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.