📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 10 మంది భ‌క్తులు మృతి

Author Icon By sumalatha chinthakayala
Updated: February 15, 2025 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ల‌క్నో: ఈరోజు ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో 10 మంది దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 19 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న మ‌హాకుంభ్‌లో పుణ్య‌సాన్నాలు చేసేందుకు వెళ్తున్న భ‌క్తులు ఆ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌యాగ్‌రాజ్‌-మీర్జాపూర్ హైవేపై ఉన్న మీజా ఏరియా వ‌ద్ద బొలెరో వాహ‌నం బ‌స్సును ఢీకొన్న‌ది.

చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని కోర్బా జిల్లా నుంచి భ‌క్తులు సంగం స్నానాల కోసం ప్ర‌యాగ్‌రాజ్ వెళ్తున్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రాజ్‌ఘ‌ర్ జిల్లా నుంచి వ‌స్తున్న బ‌స్సును.. బొలెరో వాహ‌నం ఢీకొట్టింది. ప్ర‌మాదం ప‌ట్ల యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఆరా తీశారు. త‌క్ష‌ణ‌మే స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న ఆదేశించారు. గాయ‌ప‌డ్డ వారికి చికిత్స అందిస్తున్నారు.

ఈ వారం ఆరంభంలోనే హైద‌రాబాద్ నుంచి వెళ్లిన ఏడుగురు భ‌క్తులు కూడా రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పుర్ జిల్లాలో ఓ ట్ర‌క్కును బ‌స్సు ఢీకొన్న ఘ‌ట‌న‌లో హైద‌రాబాదీ భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. కుంభ‌మేళాలో జ‌న‌వ‌రి 29వ తేదీన జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 30 మంది మృతిచెంద‌గా, 25 మందిని గుర్తించిన‌ట్లు పోలీసు అధికారి వైభ‌వ్ కృష్ణ తెలిపారు. ఆ తొక్కిస‌లాట‌లో 60 మంది గాయ‌ప‌డ్డారు. జ‌న‌వ‌రి 13వ తేదీన మొద‌లైన మ‌హాకుంభ్‌.. ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన ముగియ‌నున్న‌ది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mahakumbh Mela Prayagraj Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.