Biryani side effects : ఇటీవల నగరాల్లో కొత్త ఫుడ్ ట్రెండ్ హల్చల్ చేస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకే బిర్యానీ తినడం ఇప్పుడు యువతలో ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్లో రాత్రివేళ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వద్ద 4 AM బిర్యానీ కోసం క్యూలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రెండ్ రుచికరంగా అనిపించినా, ఆరోగ్యపరంగా మాత్రం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఖాళీ కడుపుతో లేదా అర్థరాత్రి సమయంలో బిర్యానీ లాంటి భారీ ఆహారం తీసుకోవడం జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శరీరంలోని సహజ జీవక్రియ రాత్రిపూట మందగిస్తుంది. ఆ సమయంలో ఎక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే అవి కొవ్వుగా నిల్వై బరువు పెరగడానికి దారితీస్తాయి. దీంతో ఒబెసిటీ, షుగర్, బీపీ వంటి సమస్యలు వచ్చే అవకాశముంది.
Read also: Online: 2016ని ఆన్లైన్లో ఎందుకు గుర్తుచేసుకుంటున్నారు?

ఇక ఆలస్యంగా తినడం వల్ల నిద్రపాటర్న్ కూడా దెబ్బతింటుంది. సరిగా నిద్రలేకపోవడం వల్ల అలసట, చిరాకు, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. రాత్రిపూట జంక్ ఫుడ్స్ తీసుకోవడం గ్యాస్ట్రిక్, యాసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలకు కారణమవుతుంది.
అందుకే సాయంత్రం తేలికపాటి భోజనం చేసి, రాత్రి సమయానికి నిద్రపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ట్రెండ్ కంటే టైమ్టేబుల్ ముఖ్యమని, తెల్లవారుజామున బిర్యానీకి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: