గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఇటీవల చోటు చేసుకున్న ఎయిరిండియా డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం (Air India Plane Crash) దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోవడం ద్వారా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. ఇందులో మొత్తం 275 మంది ప్రాణాలు కోల్పోయారని (275 Dies) గుజరాత్ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. మృతుల్లో 241 మంది విమాన ప్రయాణికులు కాగా, మిగతా 34 మంది విమానం కూలిన ప్రాంతంలోని స్థానికులు కావడం బాధాకరం.
తీవ్ర ఎమోషనల్ దృశ్యాలు
అధికారులు ఇప్పటివరకు 260 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించారు. వీరిలో 120 మంది పురుషులు, 124 మంది మహిళలు, 16 మంది చిన్నారులున్నారు. ఇప్పటికే 256 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. మిగిలిన మృతుల గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. బంధువుల రోదనలు, పరిచయులు చూపిన బాధలతో శవాల గుర్తింపు కేంద్రాల వద్ద హృదయ విదారక దృశ్యాలు నెలకొన్నాయి.
తీవ్ర హృదయ విదారక ఘటన
ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణించిన 242 మందిలో, కేవలం 11ఏ సీటులో కూర్చున్న ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే ప్రమాదంలో విమానం కూలిన ప్రాంతంలో ఉన్న వైద్య కళాశాల విద్యార్థుల హాస్టల్పై విమానం పడటంతో పలువురు విద్యార్థులు, స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తాలూకు దర్యాప్తు కొనసాగుతుండగా, కేంద్ర పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులు సమగ్ర నివేదిక కోసం పని చేస్తున్నారు.
Read Also : Thug Life: ‘థగ్ లైఫ్’ నుంచి ‘జింగుచా’ వీడియో సాంగ్ రిలీజ్