📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

సంక్రాంతికి మరో 26 ప్రత్యేక రైళ్లు : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

Author Icon By sumalatha chinthakayala
Updated: January 11, 2025 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైద‌రాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్​కు అదనంగా కోచ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేసింది. అదనపు కోచ్‌లు జనవరి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ప్రస్తుతం 1,128గా ఉన్న సీటింగ్‌ కెపాసిటీ 1,414కి చేరనుంది.

image

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కొన్ని ప్రధాన స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు నేటి నుంచి (జనవరి 10) 17వ తేదీల మధ్యలో సర్వీసులు నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్​ రైళ్లను నడపనున్నారు.

ఈ అన్​రిజర్వ్​డ్​ స్పెషల్​ రైళ్లు చర్లపల్లి నుంచి విశాఖపట్నం స్టేషన్ల మధ్య నేటి నుంచి 17వ తేదీల్లో మొత్తం 16 జన సాధారణ్ రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్​- అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు – కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్​ల వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే రైల్వేస్టేషన్లు అన్నీ రద్దీగా మారాయి. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయటంతో ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తోంది. అయితే రద్దీ దృష్టిలో పెట్టుకుని మరిన్ని రైళ్లు ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Andhra Pradesh Cherlapally sankranthi festival South Central Railway Special Trains for Sankranti

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.