Breaking News – Tragedy in Kenya: కెన్యా లో కొండచరియలు విరిగిపడి 21మంది మృతి

Read Time:  1 min
Breaking News – Tragedy in Kenya: కెన్యా లో కొండచరియలు విరిగిపడి 21మంది మృతి
FONT SIZE
GET APP

కెన్యాలో కురుస్తున్న వర్షాలు అక్కడి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మానవ నష్టం తీవ్రంగా పెరిగింది. తాజా సమాచారం ప్రకారం, భారీ వర్షాల కారణంగా కొండచరియలు కూలిపోవడంతో కనీసం 21 మంది మృతి చెందగా, మరో 30 మంది గల్లంతయ్యారు. రక్షణ బృందాలు మట్టిలో, శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే వాతావరణం సహకరించకపోవడంతో రక్షణ కార్యక్రమాలు మందగమనం చెందుతున్నాయి. అధికారులు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 02 నవంబర్ 2025 Horoscope in Telugu

వెస్ట్రన్ కెన్యా, ఎల్గేయో మారకువెట్, కేరిచో, నాకురు జిల్లాల్లో వర్షాల తీవ్రత అధికంగా నమోదైంది. కొండ ప్రాంతాల్లో విరిగిపడిన చరియలు గ్రామాలను పూర్తిగా ముంచేయడంతో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో అనేక ప్రాంతాలు బయటి ప్రపంచంతో పూర్తిగా వేరుపడ్డాయి. రవాణా వ్యవస్థ స్థంభించిపోవడంతో సహాయక బృందాలు అవసరమైన వస్తువులు చేరవేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వందలాది కుటుంబాలు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలకు తరలించబడ్డాయి. పశువులు, పంటలు కూడా నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.

కెన్యా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి, విపత్తు నిర్వహణ దళాలను ప్రభావిత ప్రాంతాలకు పంపింది. రెడ్ క్రాస్, స్థానిక ఎన్జీఓలు కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గల్లంతైన వారిని గుర్తించేందుకు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ వచ్చే కొన్ని రోజులు వర్షాలు కొనసాగనున్నాయని హెచ్చరించింది. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారాలు సూచించారు. కెన్యాలో ప్రతి సంవత్సరం వర్షాకాలం సమయంలో వరదలు, కొండచరియలు ప్రాణనష్టం కలిగిస్తుంటాయి కానీ ఈసారి వర్షాల తీవ్రత అతి ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.