2 లక్షల ఉద్యోగాలు కాదు..ఉన్నవి తీసేస్తున్నారు..కేటీఆర్‌ ఆగ్రహం

Read Time:  1 min
KTR tweet on the news of the arrest
KTR tweet on the news of the arrest
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాపపు పాలనలో ప్రతి బిడ్డా నిరాశలో ఉన్నారని ఆరోపించారు. 165 ఏఈఓలు, 20 కానిస్టేబుల్‌లను సస్పెండ్ చేయడం కఠినంగా ఉందని అభిప్రాయపడ్డారు. హక్కులను కోరితే ఆమోదం ఇవ్వకుండా వేధిస్తున్నారని ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీ ఇచ్చినవేనని, కానీ రేవంత్ సర్కార్ ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నదని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

సామాన్యులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రోడ్లపై వచ్చి ఆందోళన చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం అని ఆయన చెప్పారు. గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు తమ పార్టీ సాయంగా ఉంటుందని స్పష్టం చేశారు. సస్పెండ్ చేయబడిన ఉద్యోగులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదిక ద్వారా డిమాండ్ చేశారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.