हिन्दी | Epaper
రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు

హాస్టళ్లలో భోజనంపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

Sudheer
హాస్టళ్లలో భోజనంపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక

హాస్టళ్లలో భోజన వసతులపై సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక జారీచేసింది. హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో
నేడు బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల బాగోగుల పట్ల కీలక నిర్ణయాలు తెలిపారు. రెసిడెన్షియల్ హాస్టళ్లలో నాసిరకమైన భోజనం లేదా క్వాలిటీ లేని సరఫరా చేయడం వంటివి చేస్తే జైలుకు పంపిస్తా అని హెచ్చరించారు. ఈ మధ్య ఫుడ్ పాయిజనింగ్ కారణంగా విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్న ఘటనల పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని, ఎమ్మెల్యేలు, మంత్రులు తింటున్న సన్న బియ్యం గురుకుల విద్యార్థులకు కూడా అందించాలని ఆయన పేర్కొన్నారు.

విద్యా రంగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై విమర్శలు చేస్తూ.. తమ ప్రభుత్వం విద్యా బడ్జెట్‌ను పెంచిందని, గత పదేళ్లలో మూసివేయబడిన పాఠశాలలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులను వ్యసనాలకు దూరంగా ఉంచడానికి విద్యా పరిపాలనా విధానాలను చక్కదిద్దేందుకు విద్యాకమిషన్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం, యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీతో పాటు విద్యార్థుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలు పాటిస్తుందని, పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, వారి భవిష్యత్తు పట్ల శ్రద్ధ చూపడం తమ ప్రభుత్వ సంకల్పం అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రజా ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయిందని ఇవాళ్టి నుంచే ప్రజా ఉత్సవాలను ప్రారంభిస్తున్నామన్నారు. నాడు కేసీఆర్ మనువడు పెంచుకున్న కుక్కపిల్ల చనిపోతే డాక్టర్లను జైల్లో వేశారని, కానీ గురుకులాల్లో పిల్లలు చనిపోతే కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. కానీ అసెంబ్లీకి పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు నిబంధన అలాగే ఉంచారు. 21 ఏళ్లు నిండిన వారు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా పని చేస్తున్నప్పుడు 21 ఏళ్లు నిండిన వారు ఎమ్మెల్యేగా కూడా రాణిస్తారని తాను బలంగా నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870