📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సైబరాబాద్ పరిధిలో రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే బాణాసంచా కాల్చుకోవాలి – సీపీ

Author Icon By Sudheer
Updated: October 31, 2024 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌లో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చడంపై ప్రత్యేక ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాకాయలు కాల్చుకోవాలని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి ప్రకటించారు. టపాకాయలు కాల్చేటప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ధేశించిన పరిమితులకు లోబడి ఉండాలని కూడా స్పష్టం చేశారు.

ఈ ఆంక్షలు ఈరోజు నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. రాత్రి 8 గంటల ముందు లేదా రాత్రి 10 గంటల తర్వాత బహిరంగ ప్రదేశాల్లో లేదా పబ్లిక్ రోడ్లపై బాణసంచా కాలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళిని సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

diwali diwali crackers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.